
కాగజ్ నగర్, వెలుగు: లైంగిక దాడికి కేసులో నిందితుడికి పదేండ్ల జైలు శిక్ష, రూ. 40 వేల జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ రమేశ్ బుధవారం తీర్పు ఇచ్చారు. సీఐ ముత్యం రమేశ్ తెలిపిన ప్రకారం.. కౌటాల మండలం గురుడుపేటకు చెందిన యువతిని అదే గ్రామానికి చెందిన నీకోడే నరేశ్(22) ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని వెంటపడి వేధించాడు. ఆమెకు వేరొకరితో పెండ్లి అయినా .. నరేశ్ వేధింపులు ఆపలేదు. దీంతో దంపతుల మధ్య గొడవలు వచ్చాయి.
2020 సెప్టెంబర్ లో రాత్రి టాయిలెట్ కు వెళ్లిన ఆమెపై బలవంతంగా నరేశ్ లైంగిదాడికి పాల్పడ్డాడు. బాధితురాలు కౌటాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఏఎస్ఐ శివాజీ.. కేసు నమోదు చేయగా సీఐలు బి.శ్రీనివాస్, బి.స్వామి దర్యాప్తు చేపట్టి ఎంక్వైరీ రిపోర్ట్ కోర్టులో దాఖలు చేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ జగన్మోహన్ రావు, లైజనింగ్ ఆఫీసర్ రామ్ సింగ్, సీడీవో బాలాజీ, ఏఎస్ఐ, సాక్షులను కోర్టులో హాజరు పరిచారు. నేరం రుజువు కావడంతో నిందితుడు నరేశ్ కు శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు.