మంత్రి వివేక్, ఎంపీ వంశీ చొరవతో బొగ్గు బ్లాక్ దక్కింది : కాంగ్రెస్లీడర్లు

మంత్రి వివేక్, ఎంపీ వంశీ చొరవతో బొగ్గు బ్లాక్ దక్కింది : కాంగ్రెస్లీడర్లు

 కోల్​బెల్ట్, వెలుగు: సీఎం రేవంత్​రెడ్డి, రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్​వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చూపిన చొరవతోనే సింగరేణి సంస్థకు తాడిచర్ల-2 కోల్​బ్లాక్​దక్కిందని కాంగ్రెస్​లీడర్లు కొనియాడారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లోని సింగరేణి సీహెచ్​పీ కార్మికులు, కాంగ్రెస్​ లీడర్లు సీఎం, మంత్రి వివేక్, ఎంపీ వంశీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. 

తాడిచెర్ల 2 బొగ్గు బ్లాక్​ను సింగరేణికి కేటాయించాలని ఎంపీ పార్లమెంటులో నిరంతరం మాట్లాడారని పేర్కొన్నారు. కొత్త బొగ్గు బ్లాక్​కేటాయింపు వల్ల సింగరేణి సంస్థ పరిరక్షణ, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. కాంగ్రెస్​ జిల్లా అధికార ప్రతినిధి అబ్దుల్ అజీజ్, సీనియర్​ నేత గాండ్ల సమ్మయ్య, జిల్లా సెక్రటరీలు మహంకాళి శ్రీనివాస్, గోపతి బానేశ్, టౌన్​జనరల్ సెక్రటరీ బి.వేణు తదితరులు పాల్గొన్నారు.