- ఆస్పత్రి చరిత్రలో తొలిసారి రోగికి హిప్ రీప్లేస్మెంట్
కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో గురువారం ఓ కార్మికుడి కుటుంబసభ్యుడికి అరుదైన హిప్(తుంటిబాల్) రీప్లేస్మెంట్ ఆపరేషన్ను డాక్టర్లు విజయవంతంగా నిర్వహించారు. శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే న్యూటెక్ బొగ్గు గనిలో జనరల్ మజ్దూర్గా పనిచేస్తున్న శ్రీనివాస్ తండ్రి ఐలయ్య కొంతకాలంగా తుంటిభాగంలో విపరీతమైన నొప్పితో బాధపడుతున్నాడు. అతడిని ఆసుప్రతిలో చేర్పించగా సింగరేణి డీవైసీఎంవో డాక్టర్ మధుకుమార్ నేతృత్వంలో ఆర్థోపెడిక్ వైద్య బృందం ఆపరేషన్ సక్సెస్ఫుగా చేశారు.
ఇటీవల ఆస్పత్రిలో టోటల్ నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ను కూడా చేపట్టి సింగరేణి వ్యాప్తంగా మన్ననలు పొందారు. సింగరేణి ఏరియా ఆస్పత్రి చరిత్రలో వరుసగా రెండు అరుదైన ఆర్థోపెడిక్ ఆపరేషన్లను విజయవంతంగా చేసిన వైద్యాధికారి, వైద్యులు, సిబ్బందిని మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ, సింగరేణి ఛీప్మెడికల్ ఆఫీసర్(సీఎంవో) డాక్టర్ కిరణ్రాజ్, కార్పొరేట్ఆఫీసర్లు అభినందించారు. సింగరేణి ఆస్పత్రుల్లో కార్మిక కుటుంబాలకు కార్పొరేట్స్థాయి వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు.
