కోల్బెల్ట్, వెలుగు: తమ ఏరియాలో యథేచ్చగా సాగుతున్న గుడుంబా అమ్మకాలను అరికట్టాలని మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని దొరలబంగ్లా కాలనీవాసులు డిమాండ్ చేశారు. గురువారం వారు కోల్బెల్ట్హైవే వద్ద నిరసన వ్యక్తం చేశారు. దొరలబంగ్లా ఏరియాలో ఎన్నో ఏండ్లుగా గుడుంబా అమ్మకాలు జరుగుతున్నాయని, అరికట్టాలని ఎన్నిసార్లు ఎక్సైజ్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
గుడుంబా వ్యసనంతో గడిచిన రెండేండ్లలో కాలనీకి చెందిన 15 మంది వరకు ప్రాణాలు కోల్పోయారని, వారిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డునపడ్డాయన్నారు. గుడుంబా విక్రయాలను ప్రోత్సహిస్తున్నవారిపై చర్యలు తీసుకోవా లని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అబ్కారీ శాఖ స్పందించి దాడులు చేసి అమ్మకాలను నిలిపివేయాలని కోరారు.
