తాలిబాన్లకు మద్దతుగా పోస్టులు..14 మంది అరెస్ట్

తాలిబాన్లకు మద్దతుగా పోస్టులు..14 మంది అరెస్ట్

తాలిబాన్లకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన 14 మందిని అస్సాం పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా అస్సాంలోని 11 జిల్లాలకు చెందినవారని పోలీసులు చెప్పారు. అరెస్టయిన వారిలో MBBS స్టూడెంట్ కూడా ఉన్నాడన్నారు. వీరిలో కొంతమంది నేరుగా తాలిబాన్లకు సపోర్టు చేస్తూ పోస్టులు పెట్టగా, మరికొందరు తాలిబాన్లకు సపోర్ట్ చేయనందుకు నేషనల్ మీడియాను, దేశాన్ని తిడుతూ పోస్టులు పెట్టినట్లు గుర్తించారు.  మొత్తం 17 నుంచి 20 ప్రొఫైల్స్ లో తాలిబాన్లకు మద్దతుగా పోస్టులు గుర్తించామన్నారు. వీరిలో ముగ్గురు ముంబై, దుబాయి సౌదిలో ఉన్నట్లు గుర్తించామన్నారు. సోషల్ మీడియాపై నిరంతర నిఘా ఉంటుందని , దేశ భద్రతకు భంగం కలిగేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.