రూల్స్ ప్రకారమే అసెంబ్లీ, మండలి సమావేశాలు: గుత్తా సుఖేందర్ రెడ్డి

రూల్స్ ప్రకారమే అసెంబ్లీ, మండలి సమావేశాలు: గుత్తా సుఖేందర్ రెడ్డి

సెప్టెంబర్ 7వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభమవుతాయన్నారు శాసనమండలి ఛైన్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కరోనా నిబంధనల ప్రకారమే అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. సమావేశ ఏర్పాట్లను అసెంబ్లీ వ్యవహారాల మంత్రి ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి నరిసింహాచారి పరిశీలిస్తున్నారన్నారు. తానూ, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కలిసి పరిశీలించిన తర్వాత ఏర్పాట్లు జరుగుతున్నాయని చెప్పారు. ఆటోమేటిక్ టెంపరేచర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు గుత్తా సుఖేందర్ రెడ్డి.