
వికారాబాద్, వెలుగు: వార్షిక కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ జోనల్-II కాన్ఫరెన్స్ లో పాల్గొనడానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ధర్మశాలకు వెళ్లారు. ఇందులో భాగంగా ఆదివారం వారితో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్లు కులదీప్ సింగ్ పటానియా, సతీష్ మహానా భేటీ అయ్యారు. సమకాలీన రాజకీయాలతో పాటు అనేక అంశాలపై చర్చలు జరిపారు.