యూపీఏ అటవీ చట్టంతోనే గిరిజనులకు లబ్ధి : అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ 

యూపీఏ అటవీ చట్టంతోనే గిరిజనులకు లబ్ధి : అసెంబ్లీ స్పీకర్  గడ్డం ప్రసాద్ కుమార్ 

వికారాబాద్, వెలుగు: యూపీఏ  ప్రభుత్వం 2005లో తీసుకొచ్చిన అటవీ చట్టం ద్వారా గిరిజనులు ఎంతగానో లబ్ధి పొందారని, లక్షలాది మందికి భూములపై పట్టాలు వచ్చాయని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్​ కుమార్ పేర్కొన్నారు.  వికారాబాద్‌‌‌‌లో గురువారం జరిగిన ఆదివాసీ కాంగ్రెస్ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని పిలుపునిచ్చారు.  

రిజర్వేషన్లు, భూ సంస్కరణల ద్వారా గిరిజనులకు హక్కులు కల్పించిన ఘనత కాంగ్రెస్​ దేనని చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్‌‌‌‌లో గిరిజనుల కోసం రూ.  17,167 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో  ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్, ఆదివాసి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు విక్రాంత్ బురియా, ఆదివాసి కాంగ్రెస్ కన్వీనర్ రాహుల్, తాండూర్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్​కిషన్ నాయక్, సుధాకర్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.