సమస్యలకు పరిష్కారం ప్రగతి భవన్లోనే ఉందన్నారు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ లో ఆర్టీసీ మహిళ కార్మికుల నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఏ డిమాండ్ ను విరమించుకోబోమని.. అన్ని పరిష్కరించాల్సిందేనన్నారు. శ్రీనివాస్ గౌడ్ మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమ నాయకుడిగా కార్మికులకు మద్దతు తెలపాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ కార్మికులను గుర్తించాలన్నారు. ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వస్తామన్నారు. ట్యాక్సులు, పన్నులు రద్దు చేస్తే.. ఆర్టీసీని లాభాల్లోకి తెస్తామన్నారు. ప్రజా రవాణాపై ట్యాక్సులెందుకని ప్రశ్నించారు. హూజూర్ నగర్ ఎన్నికలో ఎట్ల గెలిచారో తెలియదా? అని ప్రశ్నించారు.