నేపాల్ లో ఘోర ప్రమాదం జరిగింది. డోల్కాహాలోని మాగా డ్యూరాలి నుంచి ఖాట్మండు వెళ్తున్న బస్సు సింధుపాల్చౌక్ జిల్లాలోని సుంకోషి నదిలో పడింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రయాణికులు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. బస్సులో సుమారు 34 మంది ప్రయాణిస్తున్నారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలికతో పాటు నలుగురి మహిళల మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. మిగతా మృత దేహాల కోసం సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఆదివారం ఉదయం 9 గంటలకు 34 మంది ప్రయాణికులతో బస్సు ఖాట్మండుకు బయలుదేరిందని మాగా డ్యూరాలి సబ్ ఇన్స్పెక్టర్ ప్రకాష్ పాండే తెలిపారు.
Nepal: At least 8 people dead after a passenger bus carrying at least 34 people en route to Kathmandu from Maga Deurali of Dolkaha plunged into Sunkoshi River, today.
— ANI (@ANI) November 3, 2019