శంషాబాద్, వెలుగు: దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. శంషాబాద్ మండలం పాలమాకుల ఎస్ బీఐ ఏటీఎం సెంటర్ లో గ్యాస్ కట్టర్లతో మెషీన్ ను కటింగ్ చేసి సుమారు రూ. 19 లక్షల ఎత్తుకెళ్లారు. ముందుగా దొంగలు ఏటీఎం సెంటర్ లోకి చొరబడి సీసీ కెమెరాలు ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డారు.
శంషాబాద్ పీఎస్ పరిధిలోని ఎస్ బీఐ ఏటీఎంలో చోరీ యత్నం చేసినప్పటికీ నగదు మాత్రం ఎత్తుకెళ్లలేదు. కేసు నమోదు చేసిన శంషాబాద్ రూరల్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు అప్పగించారు. ఏటీఎం మెషీన్ ధ్వంసం చేసిన ప్రదేశాన్ని డీసీపీ నారాయణరెడ్డి పరిశీలించారు.