నేటి నుంచి ఏటీపీ టాటా ఓపెన్‌‌ మహారాష్ట్ర టోర్నీ

నేటి నుంచి ఏటీపీ టాటా ఓపెన్‌‌ మహారాష్ట్ర టోర్నీ

పుణె: ఇండియా టెన్నిస్​ ప్లేయర్​ రామ్​కుమార్​ రామనాథన్​.. టాటా ఓపెన్​ మహారాష్ట్ర టోర్నీ మెయిన్​ డ్రాకు అర్హత సాధించాడు. ఆదివారం జరిగిన చివరి క్వాలిఫయింగ్​ మ్యాచ్​లో రామ్​కుమార్​  6–3, 7–5తో మటియా బెలుచి (ఇటలీ)పై నెగ్గాడు. గంటన్నర పాటు సాగిన మ్యాచ్​లో రామ్​కుమార్​ స్థాయి మేరకు రాణించాడు.

మరో మ్యాచ్​లో యూకీ బాంబ్రీ 1–6, 4–6తో ఎలియాస్​ యామెర్​ (స్వీడన్​) చేతిలో ఓడిపోయాడు.  సౌత్​ ఆసియాలో జరిగే ఏకైక ఏటీపీ–250 ఈవెంట్​ ఇది. సోమవారం నుంచి మెయిన్‌‌  రౌండ్​ స్టార్ట్‌‌ అవుతుంది.  తొలి రౌండ్​లో నగాల్​.. వరల్డ్​ 54వ ర్యాంకర్​ ఫిలిప్​ క్రాజినోవిచ్​ (సెర్బియా)తో తలపడనున్నాడు. శశికుమార్‌‌ ముకుంద్​.. ఫ్లావియో కొబోలితో, రామ్​కుమార్​.. పెడ్రో మార్టినేజ్​ (స్పెయిన్​)తో, మనాస్​ దామి.. మైకేల్​ మోహ్​ (అమెరికా)ను ఎదుర్కొంటారు. డబుల్స్​లో అంచనాలున్న రోహన్​ బోపన్న, రామ్​కుమార్​.. వేర్వేరు పార్ట్​నర్స్​తో కలిసి బరిలోకి దిగుతున్నారు.