షో వేయడం ఆలస్యమైందని.. థియేటర్ పై దాడి

  షో వేయడం ఆలస్యమైందని.. థియేటర్ పై దాడి

షో వేయడం ఆలస్యమైందని ఓ థియేటర్ పై ప్రేక్షకులు దాడి చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సుప్రీమ్ హీరో సాయిధరమ్  తేజ్ తాజాగా నటించిన విరుపాక్ష చిత్రం మూసాపేట లోని ఏషియన్ లక్ష్మీకళ సినీప్రైడ్ లో ప్రదర్శింపబడుతోంది. అయితే ఈవినింగ్ షోకు కోసం టికెట్ కొని లోపలికి వెళ్లిన ప్రేక్షకులుకు  గంటన్నర అయిన షో వేయకపోవడంతో ప్రేక్షకులు అసహనానికి గురయ్యారు. 

దీంతో  థియేటర్ లోపల అద్దాలు పగలగొట్టారు.  ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత నెలకొనడంతో థియేటర్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనా స్థలానికి చేరుకున్న  పోలీసులు పరిస్థితిని ఆదుపులోకితీసుకువచ్చారు. టికెట్ కొన్న ప్రేక్షకులకి డబ్బులు తిరిగి ఇచ్చారు థియేటర్ యాజమాన్యం. దీంతో శాంతించిన ప్రేక్షకులు సినిమా చూడకుండానే నిరుత్సాహంతో థియేటర్ నుంచి బయటకు వెళ్లారు.  

సాయి ధరమ్‌‌ తేజ్‌‌, సంయుక్తా మీనన్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ దండు దర్శకత్వం వహించారు.  ఈ  మిస్టరీ థ్రిల్లర్  చిత్రం  ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సుకుమార్ రైటింగ్స్‌‌తో కలిసి బీవీఎస్‌‌ఎన్ ప్రసాద్ కలిసి ఈ  చిత్రాన్ని నిర్మించారు.  సాలిడ్ మౌత్ టాక్ తో ఈ చిత్రం దూసుకుపోతుంది.