బస్సులపై దాడి కేసు.. 12 మందికి రిమాండ్

బస్సులపై దాడి కేసు.. 12 మందికి రిమాండ్
  •     నిందితుల్లో నలుగురు మైనర్లు
     

పంజాగుట్ట, వెలుగు: బిగ్‌ బాస్‌ సీజన్‌– 7 ఫైనల్‌ సందర్భంగా ఈ నెల 17న అన్నపూర్ణ స్టూడియో వద్ద జరిగిన ఘర్షణల్లో ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేసిన 12 మందిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిలో నలుగురు మైనర్లు ఉండగా, వారిని జువైనల్‌ కోర్టులో హాజరుపరిచారు. అరెస్టయిన వారిలో భూపతి బాలకృష్ణ(28), జి.మోహన్ కుమార్​(28), భూపతి రాఘవేందర్ (25), డి.రంజిత్ కుమార్​(22), మోలవల గణేశ్‌​(21), ధర్మపురి రోహిత్ (24), సరల రాఘవ (23), పి.సురేందర్ (20), రాపంత్ నవీన్ (19), ఎ.అరుణ్ (18), ధర్మపురి ఏసురత్నం(20), ఇదుమల్ల మహేశ్‌​(19) ఉన్నారు. ఆర్టీసీ బస్సుల ధ్వంసం కేసులో వీరిని అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపామని ఇన్‌స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపారు.