బాలీవుడ్ హీరో బాబీ డియోల్ నటిస్తున్న ఆశ్రమ్ సెట్ పై దాడి చేశారు భజ్ రంగ్ దళ్ కార్యకర్తలు. వెబ్ సిరీస్ టైటిల్ చేంజ్ చేయాలంటూ డైరెక్టర్ ప్రకాశ్ ఝా పై దాడి చేశారు. మూవీ టీంను పరుగెత్తించుకుంటూ కొట్టారు. సెట్ లోని వెహికల్స్ ను ధ్వంసం చేశారు. జైశ్రీరాం నినాదాలు చేస్తూ... హీరో బాబీ డియోల్, డైరెక్టర్ ప్రకాశ్ ఝా కు ....వ్యతిరేకంగా స్లోగన్స్ చేశారు. మధ్యప్రదేశ్ లోని భోపాల్లో షూటింగ్ జరుగుతున్న టైంలో దాడి జరిగింది.
ఇప్పటికే ఆశ్రమ్ వెబ్ సిరీస్ నుంచి రెండు సీజన్లు రిలీజ్ అయ్యాయి. మూడో సీజన్ షూటింగ్ లో ఈ దాడి జరిగింది. దాడి ఘటనపై డైరెక్టర్ ప్రకాశ్ ఝా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. వెబ్ సిరీస్ టైటిల్ కూడా చేంజ్ చేస్తామని హామీ ఇచ్చినట్లు భజ్ రంగ్ దళ్ నాయకులు తెలిపారు. తాము స్పాట్ కు చేరుకునే సరికి భజ్ రంగ్ దళ్ కార్యకర్తలంతా పరారయ్యారన్నారు భోపాల్ DIG ఇర్షద్ వలీ. నిందితులను పట్టుకుని చర్యలు తీసుకుంటామన్నారు.