
పద్మారావునగర్, వెలుగు: తెలుగు రాష్ర్టాల్లో క్రైస్తవులపై దాడులు పెరిగాయని, ప్రభుత్వాలు కట్టడి చేయాలని ఓ టీవీ డైరెక్టర్ జెరూసాలేం మత్తయ్య విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సికింద్రాబాద్ రిజుమల్ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన క్రిస్టియన్ మీడియా హెల్ప్ లైన్ సెంటర్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రైస్తవులకు ఏమైనా సమస్యలు ఎదురైతే సికింద్రాబాద్ లో తాము ఏర్పాటు చేసిన మీడియా సెంటర్కు వచ్చి చెప్పుకోవచ్చాన్నారు. పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో భారత్ క్రిస్టియన్ కౌన్సిల్ చైర్మన్ భాస్కర్ ములకాల, క్రిస్టియన్ ప్రెస్క్లబ్ కన్వీనర్ బిషబ్ తేజోమయ పాల్గొన్నారు.