క్రైస్తవులపై దాడులను అరికట్టాలి: జెరూసాలేం మత్తయ్య

క్రైస్తవులపై దాడులను అరికట్టాలి: జెరూసాలేం మత్తయ్య

పద్మారావునగర్, వెలుగు: తెలుగు రాష్ర్టాల్లో క్రైస్తవులపై దాడులు పెరిగాయని, ప్రభుత్వాలు కట్టడి చేయాలని ఓ టీవీ డైరెక్టర్ జెరూసాలేం మత్తయ్య విజ్ఞప్తి చేశారు. శుక్రవారం సికింద్రాబాద్​ రిజుమల్​ బిల్డింగ్ లో ఏర్పాటు చేసిన క్రిస్టియన్​ మీడియా హెల్ప్​ లైన్​ సెంటర్​ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్రైస్తవులకు ఏమైనా సమస్యలు ఎదురైతే సికింద్రాబాద్ లో తాము ఏర్పాటు చేసిన మీడియా సెంటర్​కు వచ్చి చెప్పుకోవచ్చాన్నారు. పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో భారత్​ క్రిస్టియన్​ కౌన్సిల్​ చైర్మన్​ భాస్కర్​ ములకాల, క్రిస్టియన్​ ప్రెస్​క్లబ్​ కన్వీనర్​ బిషబ్​ తేజోమయ పాల్గొన్నారు.