గ్రామీణ యువ క్రీడాకారులకు టాలెంట్​ సర్చ్​..ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం

గ్రామీణ యువ క్రీడాకారులకు టాలెంట్​ సర్చ్​..ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం

గ్రామీణ యువ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు   ఏపీ ప్రభుత్వం ఆడుదాం ఆంధ్రా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.  ఆంధ్రప్రదేశ్​ లోని వైసీపీ ప్రభుత్వం  క్రీడాకారుల కోసం టాలెంట్​ సెర్చ్​ కార్యక్రమం చేపడుతోంది.  దీనికోసం జగన్​ సర్కార్​ 9 సంస్థలతో ఒప్పందాలు చేసుకుంది. మరో రెండు సంస్థలతో  అగ్రిమెంట్​ కుదుర్చుకొనేందుకు చర్చలు కొనసాగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. 

ఒప్పందం కుదుర్చుకున్న సంస్థలు

  • 1. చెన్నై సూపర్ కింగ్స్  
  • 2. ప్రో కడ్డీ లీగ్
  • 3. పీవీ సింధు
  • 4. ఆంధ్రా ఖో ఖో అసోసియేషన్
  • 5. ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ 
  • 6. ఆంధ్రా వాలీబాల్ అసోసియేషన్ 
  • 7.ప్రైమ్ వాలీబాల్ లీగ్
  • 8. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్
  • 9.  ఏపీ బ్యాడ్మెంట్ అసోసియేషన్

ఈ సంస్థల నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా టాలెంట్ సెర్చ్‌ చేపట్టనున్నారు.. 

చర్చలు కొనసాగుతున్న సంస్థలు

  • 1. ముంబై ఇండియన్స్
  • 2. సన్ రైజర్స్ హైదరాబాద్ తో చర్చలు సాగిస్తున్నారు.

రాబోయే ఐపీఎల్, పీకేఎల్, పీవీఎల్ సీజన్స్ లలో ఏపీ క్రీడాకారులకు అవకాశాలు కలిపించే దిశగా చర్యలకు తీసుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.