
న్యూఢిల్లీ: లైఫ్ సైన్సెస్ పరిశ్రమపై దృష్టి సారించిన ఐటీ కంపెనీ ఆక్స్ట్రియా.. డేటా సైన్స్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, డేటా ఇంజినీరింగ్ కోసం రాబోయే ఎనిమిది నెలల్లో 1,000 మందికి పైగా ఉద్యోగులను నియమించుకోనుంది. వీరంతా గురుగ్రామ్, బెంగళూరు, నోయిడాలోని ఆక్స్ట్రియా ఆఫీసుల్లో పనిచేస్తారు. పూణే, హైదరాబాద్లో కొత్త సెంటర్లు రానున్నాయని ఆక్స్ట్రియా తెలిపింది.
డేటా సైంటిస్టులు, సాఫ్ట్వేర్ డెవలపర్లు డేటా ఇంజనీర్లతో తమ ఉద్యోగుల సంఖ్యను భారీగా పెంచుకుంటామని ఆక్స్టియా తెలిపింది. 2023 కోసం టీమ్ ఇప్పటికే ప్రముఖ ఐఐటీలు, ఇతర ప్రీమియర్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ కాలేజీల ప్లేస్మెంట్ సెల్లతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ఆక్స్ట్రియాకు ప్రస్తుతం భారతదేశంలో దాదాపు 3,000 మంది ఉద్యోగులు ఉన్నారు.