జిట్స్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు  రూ. 12లక్షల గ్రాంట్

జిట్స్ స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌కు  రూ. 12లక్షల గ్రాంట్

తిమ్మాపూర్​, వెలుగు: కరీంనగర్‌‌‌‌‌‌‌‌ జిల్లా తిమ్మాపూర్​ మండలం జ్యోతిష్మతి ఇనిస్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ అండ్ సైన్స్ (అటానమస్)లో బీటెక్(ఈసీఈ) ఫోర్త్​ ఇయర్​ స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ పెర్కారి శ్రీ చందన ప్రతిష్టాత్మక ఎంఎస్​ఎంఈ హాకథాన్- 5.0లో సత్తా చాటింది. టూవీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాహనదారుల భద్రత కోసం ఆమె రూపొందించిన ‘స్మార్ట్ వేరబుల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌బ్యాగ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌’ అనే ప్రాజెక్టుకు ప్రభుత్వం నుంచి రూ.12 లక్షల గ్రాంట్ మంజూరయింది.

ఈ సందర్భంగా స్టూడెంట్‌‌‌‌‌‌‌‌కు ప్రశంసలు తెలిపిన కాలేజీ యాజమాన్యం ఇలాంటి జాతీయస్థాయి పోటీల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యాసంస్థల చైర్మన్ జెసాగర్ రావు, సెక్రటరీ అండ్​ కరస్పాండెంట్ జె.సుమిత్ సాయి, ప్రిన్సిపాల్ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టి.అనిల్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డీన్ అకాడమిక్స్ అండ్​ ఆడిట్ డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీకే వైశాలి స్టూడెంట్‌‌‌‌‌‌‌‌ను అభినందించారు.