సీఎం రేవంత్, మంత్రి పొన్నం ఫొటోలకు ఆటో సంఘాల క్షీరాభిషేకం

సీఎం రేవంత్, మంత్రి పొన్నం ఫొటోలకు ఆటో సంఘాల క్షీరాభిషేకం
  • 40 వేల కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వడంపై హర్షం

బషీర్​బాగ్, వెలుగు: నగరంలో కొత్త ఆటో పర్మిట్లకు పర్మిషన్ ఇవ్వడంపై తెలంగాణ ఆటో డ్రైవర్ల సంఘాల జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో జేఏసీ కన్వీనర్‌‌‌‌‌‌‌‌ బి.వెంకటేశం (ఏఐటీయూసీ), వి.మారయ్య, మహేశ్ (బీఆర్‌‌‌‌‌‌‌‌టీయూ), పి.శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌, అజయ్‌‌‌‌‌‌‌‌బాబు (సీఐటీయూ), వి.ప్రవీణ్‌‌‌‌‌‌‌‌ (టీయూసీఐ), ఎం.ఎ.సలీమ్​ మాట్లాడారు. సిటీలో కొత్త ఆటో పర్మిట్లు, రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు కోసం గత రెండు దశాబ్దాలుగా అనేక పోరాటాలు చేస్తున్నామన్నారు.

కొత్తగా 40 వేల ఆటోలకు పర్మిట్లు ఇవ్వడంతో 40 వేల కుటుంబాలకు ఉపాధి దొరకుతుందన్నారు. అలాగే ఆటో మీటర్ చార్జీలు కనీసం రూ.50-, కిలోమీటర్ కు రూ. 20- పెంచాలని, రవాణా రంగ సంక్షేమ బోర్డు ఏర్పాటు ప్రతిపాదనలు ప్రకటించాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఆటో డ్రైవర్లకు రూ.12 వేల ఆర్థిక సహాయం వెంటనే అందజేయాలన్నారు. తమ పొట్టకొడుతున్న ఓలా, ఊబర్‌‌‌‌‌‌‌‌, రాపిడోల బైక్ టాక్సీలను నిషేధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి పొన్నం ప్రభాకర్ ఫొటోలకు ఆటో డ్రైవర్లు క్షీరాభిషేకం చేశారు.