బైకును తప్పించబోయి కారును ఢీకొన్న ఆటో

బైకును తప్పించబోయి కారును ఢీకొన్న ఆటో
  • 10 మందికి గాయాలు.. ఇద్దరి పరిస్థితి విషమం

కామారెడ్డి జిల్లా: బైకును తప్పించబోయిన ప్యాసింజర్ ఆటో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న పది మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆదివారం కామారెడ్డి జిల్లా నరంపల్లి గ్రామ శివారులో జరిగిందీ ఘటన. కామారెడ్డి నుంచి పొందుర్తి గ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందీ ఘటన. ఆటోలో ప్రయాణిస్తూ గాయపడిన ప్రయాణికులు పొందుర్తి, శివాయిపల్లి గ్రామాలకు చెందిన వారిగా గుర్తించారు. క్షతగాత్రుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. గాయపడిన వారందరినీ కామారెడ్డి ఏరియా హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.