ప్రగతి భవన్ వద్ద కలకలం.. కిరోసిన్ పోసుకున్నఆటో డ్రైవర్

ప్రగతి భవన్ వద్ద కలకలం.. కిరోసిన్ పోసుకున్నఆటో డ్రైవర్

ప్రగతి భవన్ వద్ద ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడి కలకలం సృష్టించాడు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు కిరోసిన్ పోసుకున్న ఆటో డ్రైవర్  చందర్ ను అడ్డుకున్నారు. అతనిపై నీళ్లు పోసి రక్షించారు. తెలంగాణ వచ్చినా ఉద్యోగాలు లేవని.. తనకు ఇంకా డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వలేదంటూ నినాదాలు చేశాడు తెలంగాణ కోసం 2010 లో అసెంబ్లీ వద్ద ఆత్మహత్య యత్నం చేశానని చెప్పాడు. దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

చిన్నారి సుమేధ కోసం వెతుకుతున్న జీహెచ్ఎంసీ సిబ్బంది

ఒక్కరోజే 96,424 కేసులు..1174 మరణాలు