స్కూల్‎కు వెళ్తుండగా ఆటో బోల్తా..

స్కూల్‎కు వెళ్తుండగా ఆటో బోల్తా..

వికారాబాద్ జిల్లాలో ఘోర సంఘటన చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా పడి విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. కుల్కచర్ల మండలం ముజాహిద్ పూర్ వద్ద విద్యార్థులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. దాంతో ఆటోలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా.. మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డ విద్యార్థులను స్థానికులు పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో ఆటోలో మొత్తం ఇరవై మంది విద్యార్థున్నట్లు సమాచారం. విద్యార్థులంతా ముజాహిద్ పూర్ మోడల్ స్కూలుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు విద్యార్థులు చెబుతున్నారు.