వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సుప్రీంలో సునీతా రెడ్డి పిటిషన్ పై సీబీఐకి నోటసులివ్వలేమన్న సుప్రీం.. ఈ పిటిషన్పై అత్యవసరం విచారణ చేపట్టాల్సిన అవసరమేముందని ప్రశ్నించింది. తదుపరి విచారణను జూన్ 19కి వాయిదా వేసింది.
విచారణ సందర్భంగా తన పిటిషన్పై తానే స్వయంగా వాదనలు వినిపించింది డా. సునీతా రెడ్డి. సునీతకు సహకరించేందుకు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రాను అనుమతించింది బెంచ్. అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకావడం లేదని కోర్టుకు చెప్పింది సునీత. అవినాష్ రెడ్డి కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమా లేదా.. విచారణకు సహకరిస్తున్నాడా లేదా అన్నది దర్యాప్తు సంస్థ వ్యవహారమని కోర్టు చెప్పింది. వివేక హత్యకేసు దర్యాప్తు జూన్ 30లోగా ముగించాలని సుప్రీంకోర్టే స్వయంగా చెప్పిందని..అందుకే ఈలోపు పిటిషన్పై విచారణ జరపాల్సిన అవసరం ఉందని వాదించింది సునీత. అయితే ఇంకో ధర్మాసనం పెట్టిన డెడ్లైన్ను తాము మార్చలేమన్న సుప్రీం.. దర్యాప్తు సంస్థకు తన వాదన వినిపించే అవకాశం ఇవ్వాలని సూచించింది. నోటీసులు ఇచ్చేందుకు తాము సిద్ధంగా లేమన్న సుప్రీం.. పిటిషనర్ కోరినందున తదుపరి విచారణ జూన్ 19కి వాయిదా వేస్తున్నామని చెప్పింది.