క్యారికేచర్ పోటీల్లో వీ6 వెలుగు కార్టూనిస్టుకు అవార్డు

క్యారికేచర్ పోటీల్లో వీ6 వెలుగు కార్టూనిస్టుకు అవార్డు

హైదరాబాద్: ‘కలయిక ఫౌండేషన్’ ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో ఎన్టీఆర్ క్యారికేచర్, కవితల పోటీలు నిర్వహించగా.. క్యారికేచర్ విభాగంలో వీ6 వెలుగు కార్టూనిస్టు జె.వెంకటేశ్ (జేవీ)కు ప్రత్యేక బహుమతి లభించింది. ఈ పోటీలకు 60 దేశాల నుంచి ఎంట్రీలు వచ్చాయి. గతంలోనే నందమూరి బాలకృష్ణ విజేతలను ప్రకటించగా, ఆదివారం హైదరాబాద్​లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది.

నటుడు రాజేంద్రప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై బహుమతులు అందజేశారు. రెండు విభాగాల్లో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష చొప్పున ఇచ్చారు. మిగతా విజేతలకు రూ.5 లక్షల నగదు అందజేశారు.