
ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రోనో ముఖర్జీ (మే 28న) ముంబైలో మరణించారు. బుధవారం రోనో ముఖర్జీ ముంబైలో గుండెపోటుతో కన్నుమూశారు. వార్ 2 మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీకి రోనో అన్నయ్య అవుతారు.
2025 మార్చి 14న అయాన్ ముఖర్జీ తండ్రి, నటుడు దేబ్ ముఖర్జీ కన్నుమూసారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా దేబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచారు. ఆ విషాదంలో నుంచి కోలుకోక ముందే రోనో మరణించడంతో ముఖర్జీ ఫ్యామిలీ శోకసంద్రంలో మునిగింది.
రోనో ముఖర్జీ అంత్యక్రియలు బుధవారం సాయంత్రం 4 గంటలకు ముంబైలోని పవన్ హన్స్లో జరిగాయి. ఆయన కుమారుడు సామ్రాట్ ముఖర్జీ అంత్యక్రియలు నిర్వహించారు. బాలీవుడ్ నటి శర్బానీ ముఖర్జీకి రోనో తండ్రి కాగా, కాజోల్, రాణీ ముఖర్జీ, వార్ 2 డైరెక్టర్ అయాన్ ముఖర్జీ, తునిషా ముఖర్జీలకు చిన్నాన్న వరుస అవుతారు.
రోనో ముఖర్జీ మృతితో వీరి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రోనో ముఖర్జీకి నివాళులు అర్పించడానికి షర్బానీ, ముఖర్జీ ఫ్యామిలీకి సంబంధించిన వారితో పాటు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
డైరెక్టర్ రోనో ముఖర్జీ సినీ ప్రస్థానం:
తు హి మేరీ జిందగీ (1965), రోనో హైవాన్ (1977) అనే రెండు చిత్రాలను రోనో ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. ఆ తర్వాత ఆయన అనేక బాలీవుడ్ చిత్రాలలో అన్సూ బాన్ గయే ఫూల్, అభినేత్రి, దో ఆంఖేన్, బాటన్ బాటన్ మే, కమీనీ మరియు గుడ్గుడీ వంటి ఇతర చిత్రాలకు పనిచేసి మంచి గుర్తింపు పొందారు.