న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని షెడ్యూల్ టైంలోనే పూర్తి చేస్తామని టెంపుల్ నిర్మాణ సంస్థలో పనిచేసే అధికారి ఒకరు తెలిపారు. గుడిని డిసెంబరు 2023 నాటికి పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం టెంపుల్ నిర్మించే స్థలంలో ఫిల్లింగ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు టెంపుల్లో దర్శనాలకు భక్తులను అనుమతించే అవకాశం ఉందన్నారు. ‘‘ఆగస్టు 27–29 మధ్య ఆలయ నిర్మాణంపై రివ్యూ మీటింగ్ జరిగింది. టెంపుల్ ఎక్కువకాలం స్ట్రాంగ్గా ఉండడానికి పూర్తిగా రాతితో నిర్మిస్తున్నారు. నిర్మాణ స్థలంలో మట్టిని పరీక్షించిన తరువాత 12 అడుగుల లోతుకు పునాదులు తవ్వాలని నిర్ణయించాం. 2,500 సంవత్సరాల తరువాత వచ్చే భూకంపాలను కూడా తట్టుకుని నిలబడేలా ఫైనల్ డిజైన్ను రూర్కెలాలోని సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించింది’’ అని అధికారి చెప్పారు. పునాదులను 18,500 స్క్వేర్ మీటర్ల రోలర్ కాంపాక్ట్ కాంక్రీట్ (ఇంజనీర్డ్ ఫిల్)తో నింపాలని ఎక్స్పర్ట్ కమిటీ సూచించింది. మొత్తం 44.5 లక్షల క్యూబిక్ అడుగుల ఇంజనీరింగ్ ఫిల్ను, మిగిలిన పరిమాణంలో మంచి క్వాలిటీ మట్టిని నింపాలని అధికారులు చెప్పారు. భూకంపాలను తట్టుకునేలా టెంపుల్ నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇంజనీరింగ్ ఫిల్ పైన16 అడుగుల ఎత్తులో ప్లింత్ను ఏర్పాటు చేస్తున్నారు.
2023 డిసెంబర్ నాటికి అయోధ్య రాముడి గుడి పూర్తి
- దేశం
- September 10, 2021
లేటెస్ట్
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
- Good Health: చిరుధాన్యాల బ్రేక్ఫాస్ట్.. ఆరోగ్యదాయకం
- లైసెన్స్ లేకుండా బైక్ నడుపుతున్న మైనర్లు..జువైనల్ హోంకు తరలింపు
- ఎవరు, ఎవరితో టచ్లో ఉన్నారో ఎన్నికల తర్వాత తెలుస్తది : జగ్గారెడ్డి
- రెండు అత్యాచారం కేసుల్లో సంచలన తీర్పులు. దోషులకు 20 ఏళ్లు జైలు
- భువనగిరి ఫుడ్ పాయిజన్ ఘటనపై కేంద్రం సీరియస్
Most Read News
- అప్పుడు మెట్రో.. ఇప్పుడు బస్సులు : బికినీతో బస్సు ఎక్కిన అమ్మాయి
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి