అనుమానస్పద స్థితిలో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య

అనుమానస్పద స్థితిలో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య

సంగారెడ్డి: లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ట్రైన్ కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు పుల్కల్ మండలం సుల్తాన్ పూర్ కు చెందిన సాయి తేజగా గుర్తించారు. జేఎన్టీయూ క్యాంపస్ లో హాస్టల్ లో ఉంటూ బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న సాయితేజ నిన్న సాయంత్రమే క్యాంపస్ నుండి బయటకు వెళ్లినట్లు సమాచారం. హాస్టల్  రికార్డుల్లో విద్యార్థి బయటకు వెళుతున్నట్టు నమోదు చేసుకోకుండా జేఎన్టీయూ సిబ్బంది నిర్లక్ష్యం వహించారని తోటి విద్యార్ధులు అంటున్నారు. ప్రేమ వైఫల్యంతో మనస్తాపం చెంది,  సాయితేజ ఆత్మహత్య చేసుకున్నట్టు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.