Baahubali: ‘బాహుబలి’ రీ రిలీజ్‌తో సరికొత్త ప్రయోగం.. రాజమౌళి మాస్టర్ ప్లాన్కి మళ్లీ ప్రభంజనమే!

Baahubali: ‘బాహుబలి’ రీ రిలీజ్‌తో సరికొత్త ప్రయోగం.. రాజమౌళి మాస్టర్ ప్లాన్కి మళ్లీ ప్రభంజనమే!

తెలుగు సినిమాని పాన్‌‌ ఇండియా స్థాయిలో నిలబెట్టిన ఫస్ట్ మూవీ ‘బాహుబలి’.ప్రభాస్‌‌, రానా, అనుష్క లీడ్ రోల్స్‌‌లో రాజమౌళి తెరకెక్కించిన ఈ బ్లాక్బస్టర్‌‌‌‌ మూవీ ఇప్పుడు రీ రిలీజ్‌‌కు రెడీ అవుతోంది.

ఇటీవలే ‘బాహుబలి 2: ది కన్‌‌క్లూజన్‌‌’రిలీజై ఎనిమిదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ‘బాహుబలి’చిత్రాన్ని రీ రిలీజ్‌‌ చేయబోతున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే, మాములుగా వచ్చే రీ రిలీజ్‌‌ సినిమాల మాదిరిగా కాకుండా.. ఆడియన్స్కు ఒక ట్విస్ట్ ఇచ్చేలా రిలీజ్ చేస్తున్నారంటూ నేషనల్ మీడియాల్లో కథనాలు వస్తున్నాయి. వివరాల్లోకీ వెళితే.. 

ఐదున్నర గంటల నిడివి గల బాహుబలి రెండు భాగాలను.. కలిపి ఒకే సినిమాగా విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం బాహుబలి టీం అందుకు సంబంధించిన మూవీ కటింగ్స్లో బిజీగా ఉందంట. లేటెస్ట్ సినిమాటిక్ అనుభవం కోసం కొత్త కట్స్ కూడా యాడ్ చేస్తున్నారట మేకర్స్. ఈ ప్రయత్నం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అంత పెద్ద కథను ఒకే సినిమాలో చెప్పిన జక్కన్న.. ఇపుడు మూడు గంటల సినిమాగా తీసుకొస్తున్నారంటూ నేషనల్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అలాగే, ఈ సినిమాను భారతదేశంతో పాటు అంతర్జాతీయ స్థాయిలో రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.

ఇపుడీ ఈ వార్త ప్రభాస్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. 'అన్నను వెండితెరపై చూడటానికి రెడీగా ఉన్నామంటూ' సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.  2025 అక్టోబర్లో బాహుబలి రీ-రిలీజ్‌ కానుంది. రీ-రిలీజ్ తేదీ ఇంకా అనౌన్స్ చేయలేదు.

ఇకపోతే, బాహుబలి ఫస్ట్ పార్ట్ జూలై 2015లో విడుదలైంది. సెకండ్ పార్ట్ ఏప్రిల్ 2017లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. "బాహుబలి: ది బిగినింగ్" ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసింది. "బాహుబలి 2: ది కంక్లూజన్" రూ.1788.06 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇలా అప్పట్లోనే రికార్డులు సృష్టించిన బాహుబలి, రీ రిలీజ్‌‌లో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అనే అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు SSMB29 మూవీతో రాజమౌళి బిజీగా ఉన్నారు.