బీఆర్ఎస్​లోకి బాబుమోహన్ కొడుకు

బీఆర్ఎస్​లోకి బాబుమోహన్ కొడుకు

సిద్దిపేట/ జోగిపేట, వెలుగు : ఆందోల్  నియోజకవర్గంలో బీజేపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబుమోహన్  కొడుకు ఉదయ్  ఆదివారం బీఆర్ఎస్ లో చేరారు. సిద్ధిపేటలో మంత్రి హరీశ్ రావు, ఆందోల్  ఎమ్మెల్యే అభ్యర్థి క్రాంతి కిరణ్  సమక్షంలో బీఆర్ఎస్  కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు బీజేపీ నేతలు కూడా హరీశ్​ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. కాగా బీజేపీలో మొదటి నుంచి బాబు మోహన్​కు ఎదురుగాలి వీస్తూనే ఉంది.

ఆందోల్  బీజేపీ  టికెట్​ఆశించిన మాజీ జడ్పీ చైర్మన్​ బాలయ్యకు  అధిష్టానం టికెట్  ఇవ్వలేదు. దీంతో బాలయ్య బీజేపీకి రాజీనామా చేసి బీఆర్ఎస్​ చేరారు. ఆయనతో పాటు మరి కొందరు సీనియర్​లు కూడా పార్టీని వీడారు. అలాగే బాబు మోహన్​ కొడుకు ఉదయ్  కూడా  బీజేపీ టికెట్​ ఆశించారు. కానీ పార్టీ హైకమాండ్ ఆయనకు టికెట్  కేటాయించలేదు. దీంతో మనస్తాపానికి గురైన ఉదయ్.. బీఆర్ఎస్ లో చేరారు.