
- గంటల్లో కిడ్నాపర్ను పట్టుకున్న పోలీసులు
- తల్లికి అప్పగింత
పద్మారావునగర్, వెలుగు: గాంధీ దవాఖానలో రెండు రోజుల వయస్సున్న బాబు కిడ్నాప్ సంచలనం రేపింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరుకు చెందిన ఎస్ కే సుభాన్భార్య షాహీనా(25) మంగళవారం రాత్రి 10.30 గంటలకు మగబిడ్డకు జన్మనిచ్చింది. వీరికి ఇప్పటికే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు షాహీనాను తీసుకొని సుభాన్డాక్టర్దగ్గరికి వెళ్లాడు.
షాహీనా అత్త చతుబీ ఎంసీహెచ్బిల్డింగ్గైనిక్వార్డులోని బాబు వద్ద ఉంది. కొద్దిసేపటి తర్వాత ఆమె వాష్రూమ్కు వెళ్లింది. తిరిగొచ్చి చూడగా బాబు కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే వార్డులో ఓ మహిళ ఉదయం నుంచి అనుమానాస్పదంగా తిరుగుతోందని, ఆమెపై అనుమానం ఉందని చెప్పారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా ఓ మహిళ బాబును ఎత్తుకెళ్తూ కనిపించింది.
ఆరా తీయగా ఆమె బిహార్కు చెందిన పూజాదేవి అని తెలిసింది. సీసీ ఫుటేజీల ఆధారంగా ఆమె నాచారం వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పూజాదేవిని పట్టుకుని విచారించగా పిల్లలు లేని తన కొలీగ్కు బాబును ఇచ్చినట్లు చెప్పింది. వెంటనే వారి వద్ద నుంచి బాబును స్వాధీనం చేసుకుని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలు పూజాదేవిని అరెస్ట్చేశారు.