మీడియాతో గొడవకు దిగిన బేబీ చిత్ర నిర్మాత.. ఆపై క్షమాపణ

మీడియాతో గొడవకు దిగిన బేబీ చిత్ర నిర్మాత.. ఆపై క్షమాపణ

బేబీ సినిమా విజయయాత్రలో వివాదం చోటుచేసుకుంది. బేబీ సినిమా విడుదలై వియజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ విజయ యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా తాజాగా ఏపీలోని భీమవరంలో పర్యటించారు. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్ వద్దకు చేరుకున్నారు. అంతేకాదు మీడియా ప్రతినిధులు కూడా వచ్చారు.   

అందరి ఒకేసారి గుంపుగా రావడంతో.. మీడియా ప్రతినిధులని  గమనించని బౌన్సర్లు వారిని కూడా తోసేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రక్తత నెలకొంది. మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. చిత్ర నిర్మాత ఎస్కేఎన్ కారును బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. కాసేపటికి కారునుండి బయటకు వచ్చిన ఎస్కేఎన్.. మీడియా వారితో వాగ్వాదానికి దిగారు. కాసేపటికి ఎస్కేఎన్ సారీ చెప్పడంతో మీడియా ప్రతినిధులు ఆందోళన విరమించారు. ఇక ఈ తోపులాటలో కాస్త అస్వస్థతకు గురైన వారిని స్థానికి ఆసుపత్రికి తరలించారు. ఈ గొడవకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.            

ఇక బేబీ సినిమా విషయానికి వస్తే.. దర్శకుడు సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య , విరాజ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు. జులై 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. తొలిరోజే రూ.7 కోట్ల కలెక్షన్స్‌ రాబట్టింది. చిన్న సినిమాగా రిలీజైన ఈ సినిమా కేవలం 20 రోజుల్లో దాదాపు రూ.85 కోట్ల వరకు వసూళ్లు రాబట్టి ఈ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.