అద్దె చెల్లించడం లేదని.. బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల స్కూల్కు తాళం..

అద్దె చెల్లించడం లేదని.. బాగ్ లింగంపల్లి మైనార్టీ గురుకుల స్కూల్కు తాళం..

ముషీరాబాద్, వెలుగు: స్కూళ్ల రీ ఓపెనింగ్​ వేళ బాగ్ లింగంపల్లి లోని తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ గర్ల్స్ స్కూల్ కు తాళం పడింది. అద్దె భవనంలో ఈ స్కూల్​ నడుస్తుండగా ఏడాది నుంచి రెంట్​ కట్టకపోవడంతో యజమాని సాహెల్ కొఠారి తాళం వేశారు. అద్దె ఇస్తేనే తాళం తీస్తానని మొండికేశారు. ఇందులో 370 మంది స్టూడెంట్లు చదువుకుంటున్నారు. 

తాళం వేయడంతో ప్రిన్సిపాల్, టీచింగ్​ స్టాఫ్​ గంటల పాటు బయట వేచి ఉండాల్సి వచ్చింది. అప్పటికే కొంతమంది విద్యార్థులు వెనుదిరిగి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న హిమాయత్ నగర్ తహసీల్దార్​ సంధ్యారాణి భవన యజమానితో మాట్లాడారు. 

అయినా ఆయన వినకపోవడంతో తహసీల్దార్​ కార్యదర్శి యాసిన్ భాషకు చెప్పారు. వారు ముందుగా ఐదు నెలల అద్దె బకాయి చెల్లిస్తామని చెప్పడంతో యజమాని తాళం తెరిచారు. అంతకుముందు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ నాయకులు పాఠశాల ఎదుట యజమానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.