ట్రిపుల్​ఆర్​ ఆందోళనకారులకు బెయిల్

ట్రిపుల్​ఆర్​ ఆందోళనకారులకు బెయిల్

యాదాద్రి, వెలుగు :  ట్రిపుల్ ఆర్​ ఆందోళనకారులకు భువనగిరి జిల్లా సెషన్స్​ కోర్టు సోమవారం బెయిల్​ మంజూరు చేసింది.  13న  నల్గొండ జిల్లా జైలు నుంచి విడుదల కానున్నారు. జైల్లో ఉన్న నలుగురు, అజ్ఞాతంలో ఉన్న  బీజేపీ స్టేట్​ లీడర్​ గూడూరు నారాయణరెడ్డి, తంగెళ్లపల్లి రవికుమార్​ బెయిల్​ ఇప్పించడానికి అడ్వకేట్లు నరేంద్ర ప్రసాద్, సూదగాని రవికుమార్​ ప్రయత్నించారు.

దీంతో నల్గొండ జైల్లో ఉన్న నలుగురికి 14 రోజులకు బెయిల్​ లభించడంతో పాటు గూడూరు నారాయణరెడ్డి, రవికుమార్​కు భువనగిరి జిల్లా సెషన్స్​ కోర్టు ముందస్తు బెయిల్​ మంజూరు చేసింది. కాగా, ట్రిపుల్​ఆర్​ అలైన్​మెంట్​ మార్చేంతవరకూ ఆందోళన కొనసాగిస్తామని బీజేపీ స్టేట్​ లీడర్​ గూడూరు నారాయణరెడ్డి చెప్పారు. ఆందోళనకారులపై నాన్​ బెయిలబుల్​ కేసులు నమోదు చేసి జైలుకు పం పినా.. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్​రెడ్డి  స్పందించకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే శేఖర్​రెడ్డికి ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు.