అంతరించి పోతున్న కళలకు జీవం పోసేందుకు కేంద్రం కళాకారులను ఆదరించి ఇటీవల పద్మ అవార్డులు ప్రకటించింది. బుర్ర వీణ కళకు తన జీవితాన్ని అంకితం చేసి, ఆ కళ పరిరక్షణకు కృషి చేస్తున్న నారాయణ పేట జిల్లా, దామర్ గిద్ద మండల కేంద్రానికి చెందిన దాసరి కొండప్పను (Dasari Kondappa) కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సినీ ప్రముఖుల నుంచి తెలంగాణ కళాకారుల వరకు ప్రశంసలు అందుతున్నాయి..సన్మానాలు జరుగుతున్నాయి.
తాజాగా బలగం సినిమా చిత్ర బృందం దాసరి కొండప్పను కలిసి సత్కరించింది. అంతేకాకుండా ప్రొడ్యూసర్ దిల్ రాజు, డైరెక్టర్ వేణు లక్ష రూపాయలు బహుమతిగా అందజేశారు. ఆయనతో కాసేపు పాటను పాడించారు. బలగం సినిమాలో దాసరి కొండప్ప పాడిన అయ్యో శివుడా యేమాయె..యేనకటి దానికి సరిపోయే అయ్యో శివుడా యేమయే..యేనకటి దానికి సరిపోయింది పాట ప్రజల్ని ఎంతోగాను ఆకట్టుకుంది.
#DasariKondappa garu who sang a song and acted in the film #Balagam has been awarded the PRESTIGIOUS PADMA SHRI ❤️
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) February 3, 2024
The entire team met him, felicitated him and presented a cheque of 1 Lakh as a token of appreciation!
@PriyadarshiPN @KavyaKalyanram @LyricsShyam@adityamusic pic.twitter.com/CA3w4b7pr4
బలగం సినిమా తెలంగాణ నాడిని..పల్లెటూరి ప్రేమలని..ప్రతి ఇంట్లో బంధాలని..చాలా సహజంగా అందరికీ నచ్చేలా చూపి కళ్ళు తెరిపించింది. దీంతో చాలా మంది 'మీరే నా బలం..మీరుంటేనే నా బలగం' అనుకునేలా బలగం సినిమా చేసింది.