
బలగం (Balagam) సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకున్నాడు జబర్దస్త్ వేణు (Jabardasth Venu). ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకున్నాడు. దాంతో జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణు(Balagam Venu)గా మారిపోయాడు.వేణు తనలోని టాలెంట్ని..నాటకాలతోను, జబర్దస్త్ షోస్ లోను,కమెడీయన్ గాను నిరూపించుకుంటూ వచ్చారు. ఇక బలగం సినిమాను డైరెక్ట్ చేసి..తెలంగాణ మట్టి వాసనను తట్టిలేపే డైరెక్టర్ వచ్చాడంటూ ఇండస్ట్రీ గుర్తింపు పొందారు.
తాజాగా వేణు తన సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 'నా బలగం సినిమా అందరూ చూశారు. మా నాన్న తప్ప' అంటూ తండ్రిని మిస్ అవుతున్నట్లుగా తెలిపారు. తన తండ్రి ఫిబ్రవరి 6వ తేదీ 2000 సంవత్సరంలో చనిపోయినట్లు వెల్లడించిన వేణు..ఆవేదన వ్యక్తం చేస్తూ పంచుకున్న ట్వీట్ కు నెటిజన్స్ స్పందిస్తున్నారు. నీ అఖండ విజయాన్ని..నాన్న ఎక్కడున్న చూసే ఉంటాడు..ధైర్యంగా ముందుకు కదులు వేణు అన్న..అంటూ రీ ట్వీట్స్ చేస్తున్నారు.
ప్రస్తుతం బలగం వేణు..దిల్ రాజు బ్యానర్లో న్యాచురల్ స్టార్ నానితో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమాకు ఎల్లమ్మ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
Naa BALAGAM Cinema andaru choosaaru..
— Venu Yeldandi #Balagam (@VenuYeldandi9) February 8, 2024
Maa nanna tappa?
MISS YOU NAAINA?
Late 06/02/2000#father pic.twitter.com/U831rWKRgS