పదునైన గొడ్డలికి  ఆంజనేయ స్వామి తాయెత్తు

పదునైన గొడ్డలికి  ఆంజనేయ స్వామి తాయెత్తు

ఈ ఏడాది సంక్రాంతికి ‘వీర సింహారెడ్డి’గా,  దసరాకి ‘భగవంత్ కేసరి’గావచ్చి బ్లాక్ బస్టర్ సక్సెస్‌‌‌‌ను అందుకున్న బాలకృష్ణ అదే జోష్‌‌‌‌లో  నెక్స్ట్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రీసెంట్‌‌‌‌గా పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు. బుధవారం నుంచి రెగ్యులర్ షూటింగ్‌‌‌‌ను స్టార్ట్ చేసినట్టు అనౌన్స్ చేశారు.  ఈ సందర్భంగా రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్‌‌‌‌‌‌‌‌తోనే సినిమాపై అంచనాలు పెంచారు.

పదునైన గొడ్డలికి  ఆంజనేయ స్వామి తాయెత్తు, కళ్లజోడు కనిపిస్తుండగా, ఆ కళ్లద్దాలలో అసురులపై  నరసింహ స్వామి ఉగ్రరూపం చూపుతున్న  షాడోను చూపిస్తూ సినిమా ఎంత పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్‌‌‌‌గా ఉంటుందో హింట్ ఇచ్చారు. అలాగే ‘బ్లడ్ బాత్‌‌‌‌ కా బ్రాండ్ నేమ్.. వయిలెన్స్‌‌‌‌  కా విజిటింగ్ కార్డ్‌‌‌‌’ అంటూ బాలకృష్ణ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ ఈ పోస్టర్‌‌‌‌‌‌‌‌ను సోషల్ మీడియాలో పోస్ట్‌‌‌‌  చేశాడు బాబీ.  ఇది బాలకృష్ణ నటిస్తున్న 109వ సినిమా. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు.  

శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌‌‌‌టైన్‌‌‌‌మెంట్స్‌‌‌‌, ఫార్చ్యూన్‌‌‌‌ ఫోర్ సినిమాస్‌‌‌‌ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.