భగవంత్ కేసరి గణేష్ ఆంథెమ్ ప్రోమో రిలీజ్.. బాలయ్య, శ్రీలీల మాస్ డైలాగ్స్తో ఇచ్చిపడేశారు

భగవంత్ కేసరి గణేష్ ఆంథెమ్ ప్రోమో రిలీజ్.. బాలయ్య, శ్రీలీల మాస్ డైలాగ్స్తో ఇచ్చిపడేశారు

నటసింహ నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో వస్తున్న మాస్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి(Bhagavanth Kesari). లేటెస్ట్గా ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ సాంగ్ గణేష్ చతుర్థి స్పెషల్ గణేష్ ఆంథెమ్గా రాగా.. ఢోల్ ధమాకా అంటూ బాలయ్య దుమ్ము లేపాడు. గణపతి పప్పా మోరియాతో స్టార్ట్ అయినా ఈ ప్రోమోలో..బాలయ్య, శ్రీలీల మాస్ డైలాగ్స్ ఇచ్చిపడేశారు. తెలంగాణా యాసలో బాలయ్య.' బిడ్డా..మ్యూజిక్ సరిపోట్లే..సప్పుడు జరా గట్టిగా జేయమను..శ్రీలీల మాస్ డైలాగ్తో.. అరే తీసి పక్కన పెట్టండిరా మీ తీన్ మారు..మా చిచ్చా వచ్చిండు.. ఇగ యెట్లా ఉంటది..సౌ మారు..అంటూ ప్రోమోతో దుమ్ములేపారు. 

ఇక పూర్తి సాంగ్ కన్ఫర్మ్ గా ఇచ్చి పడేసేలా ఉండటంలో నో డౌట్ అంటున్నారు బాలయ్య ఫ్యాన్స్. థమన్ ఇచ్చిన మాస్ బీట్కు అద్దిరిపోయే బాలయ్య..శ్రీలీల స్టెప్పులకు గణేష్ ప్రాంగణం మోత మోగేలా ఉంది.సెప్టెంబర్ 1న పూర్తి పాట రిలీజ్ చేయనున్నారు మేకర్స్.

ఇక బాలయ్య మాస్ జాతరకు సిద్ధం కండి అంటు డైరెక్టర్ అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు. ఈ సాంగ్ను కాసర్ల శ్యామ్ రచించగా..శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. జై బాలయ్య సాంగ్ పాడిన కరీముల్లా, మనీష్ పాండ్రంకి పాడినట్లు తెలుస్తుంది. అలాగే త్వరలో భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగా కండక్ట్ చేయడానికి అనిల్ రావిపూడి రెడీ అయ్యినట్టు టాక్. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టీజర్కు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్కు చేరుకున్నాయి. 

ALSO READ :ముద్దు పెడితే తప్పేంటీ.. సమర్థించుకున్న డైరెక్టర్

ఇక భగవంత్ కేసరి సినిమా విషయానికి వస్తే..షైన్ స్క్రీన్(Shine screen) పతాకంపై సాహు గరికపాటి(Sahu garikapati) నిర్మిస్తున్న ఈ సినిమాలో.. కాజల్ అగర్వాల్(Kajal Agarwal) హీరోయిన్ గా నటిస్తుండగా..లేటెస్ట్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) బాలకృష్ణకు కూతురిగా కనిపించనుంది. తమన్(Thaman) సంగీతం అందిస్తున్న ఈ సినిమా..2023 అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.