పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా.. ముస్లిం సోదరులకు, అనంతపురం జిల్లా హిందూపురం MLA నందమూరి బాల కృష్ణ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు హిందూపురంలోని అల్ హిలాల్ షాదీఖానాలో ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లిం సోదరులతో కలిసి బాలకృష్ణ ప్రార్థనల్లో పాల్గొననున్నారు. తర్వాత ఇఫ్తార్ విందులో పాల్గొననున్నారు.
తనను హిందూపూర్లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన సందర్భంగా బాలయ్య అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.