బాలకృష్ణ, వెంకటేష్, నాని.. ఒకే కథతో వస్తున్న ముగ్గురు హీరోలు!

బాలకృష్ణ, వెంకటేష్, నాని.. ఒకే కథతో వస్తున్న ముగ్గురు హీరోలు!

టాలీవుడ్ రానున్న రెండు, మూడు నెలల్లో సినిమా జాతర మొదలుకానుంది. అందులో స్టార్ హీరోలు, పాన్ ఇండియా సినిమాలు కూడా  ఉన్నాయి. ప్రభాస్(Prabhas), రామ్(Ram), బాలకృష్ణ(Balakrishna), విజయ్ దేవరకొండ(Vijay devarakonda), నాని(Nani),వెంకటేష్(Venkatesh).. ఇలా చాలా మంది స్టార్ హీరోల సినిమాను వరుసగా థియేటర్స్ లోకి రానున్నాయి. అయితే ఇందులో ముగ్గురు హీరోల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వాల్లెవరంటే.. బాలకృష్ణ, వెంకటేష్, నాని. ఈ ముగ్గురు హీరోలు తన తరువాతి సినిమాల కోసం ఒకే కథను ఎంచుకున్నారు. ఇంతకీ ఏంటా కథ అనుకుంటున్నారా? ఈ ముగ్గురు హీరోలు తన తరువాత సినిమాల కోసం కూతురు సెంటిమెంట్ ను ప్రధానంగా తీసుకుంటున్నారు. 

అందులో ముందుగా బాలకృష్ణ హీరోగా వస్తున్న భగవంత్ కేసరి. ఈ సినిమాలో బాలయ్య తన కూతురుని కాపాడుకునే తండ్రిగా కనిపించనున్నారు. శ్రీలీల బాలకృష్ణకు కూతురి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. 

ఆతరువాత వస్తున్న సినిమా వెంకటేష్ సైంధవ్‌. హిట్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ యాక్షన్ సినిమా కూడా కూతురి సెంటిమెంట్ ప్రధానంగా రానుంది. ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన పోస్టర్ చూస్తే క్లియర్ గా అర్థమవుతోంది. ఈ సినిమా డిసెంబర్ 22 ప్రేక్షకుల ముందుకు రానుంది. 

నాని హీరోగా వస్తున్న హాయ్ నాన్న కూడా కూతురి  సెంటిమెంట్ ప్రధానంగా రానుంది. ఆ విషయాన్ని టైటిల్ లోనే చెప్పేశారు మేకర్స్. ఇక ఈ సినిమాలో సీతారామం ఫెమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరి దాదాపు ఒకే కథతో వస్తున్న ఈ సమూడు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.