
- ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు
- 27 బైకులు, ఆటో స్వాధీనం
గచ్చిబౌలి, వెలుగు: రైల్లో వచ్చి రెక్కీ వేసి బైక్ లను ఎత్తుకెళ్లే ముఠాను బాలానగర్సీసీఎస్, జీడిమెట్ల పోలీసులు అరెస్ట్చేశారు. నిందితుల వద్ద 27 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకోగా.. వాటి విలువ 22.20 లక్షలు ఉంటుంది. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్కమిషనరేట్ లో బుధవారం సీపీ స్టీఫెన్రవీంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. వికారాబాద్జిల్లా యాలాల్మండలం కమల్పూర్కు చెందిన బోయిన శ్రీకాంత్(22), మేదరి భాస్కర్(22) ఆటో డ్రైవర్లు.
ఇదే మండలం నాగసముద్రానికి చెందిన మెట్టు శ్రీకాంత్(19) లేబర్. ముగ్గురూ కలిసి తాండూరు నుంచి హైదరాబాద్కు రైలులో వచ్చి.. ముందుగా రెక్కీ వేసి కాలనీలు, బస్తీల్లో రాత్రిపూట పార్కింగ్బైకులను మారు తాళాలతో తీసుకుని ఎత్తుకెళ్లేవారు. వాటిని తాండూరు, వికారాబాద్తో పాటు తదితర ప్రాంతాల్లో అమ్మేవారు. హైదరాబాద్, సైబరాబాద్, వికారాబాద్పరిధిలో 27 బైక్ లు, ఒక ఆటోను చోరీ చేశారు. పోలీసులు నిఘా పెట్టి ముగ్గురిని అరెస్ట్చేశారు. సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలో 15 కేసుల్లో నిందితులుగా ఉండగా, 2022లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లొచ్చినా బైకు చోరీలను ఆపడంలేదని పోలీసులు తెలిపారు.