డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్..

డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్ట్..

జిమ్, క్లినిక్ లే టార్గెట్ గా స్టెరాయిడ్స్, ఇంజక్షన్స్, ట్యాబ్లెట్స్ సప్లై చేస్తున్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారంతో హైదరాబాద్ ఫతేనగర్ లో హరిసేనాపతి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని.. మరొకరు పరారీలో ఉన్నాడని బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ ప్రకటించారు. నిందితుడి నుంచి 33 రకాల టాబ్లెట్స్, ఇంజక్షన్స్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. వాటి విలువ సుమారు రూ. 3 లక్షలు ఉంటుందని తెలిపారు. వారు చెప్పిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.

చెన్నైకు చెందిన శ్రీనివాస్ తో కలిసి హరి దందా చేస్తున్నాడు. చెన్నై నుంచి డ్రగ్స్ తెచ్చి హైదరాబాద్ లోని సనత్ నగర్ పరిసరాలలో విక్రయిస్తున్నాడు. ఈ కేసులో హరిసేనాపతిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నామ‌ని.. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. స్టెరాయిడ్స్ వల్ల ప్రాణానికి ప్రమాదమని, ప్రజలు వీటిబారిన పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డ్రగ్ కంట్రోల్​ అధికారి రవికాంత్ కోరారు.