రూ.24.6 లక్షలకు బాలాపూర్ లడ్డూను కొన్న లక్ష్మారెడ్డి

రూ.24.6 లక్షలకు బాలాపూర్ లడ్డూను కొన్న లక్ష్మారెడ్డి

హైదరాబాద్: ప్రతిష్టాత్మక బాలాపూర్ లడ్డూను బాలాపూర్ గ్రామస్థుడు వంగేటి లక్ష్మారెడ్డి కైవసం చేసుకున్నారు. ఈ ఏడాది జరిగిన బాలాపూర్ లడ్డూ వేలం పాటలో మొత్తం 28 మంది పాల్గొనగా... లడ్డూ అదృష్టం మాత్రం స్థానికుడైన వంగేటి లక్ష్మారెడ్డికే దక్కింది. రికార్డ్ స్థాయిలో వేలం పలికిన బాలాపూర్ లడ్డూను లక్ష్మారెడ్డి... రూ.24 లక్షల 60 వేలకు సొంతం చేసుకున్నారు. దీంతో బాలాపూర్ లడ్డూ గతేడాది కంటే రూ.5 లక్షల 70 వేలు ఎక్కువకు అమ్ముడుపోయింది. గతేడాది మర్రి శశాంక్ రెడ్డి, ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్ బాలాపూర్ లడ్డూను రూ.18 లక్షల 90 వేలకు దక్కించుకున్నారు.