మార్చి  14న కొండగట్టుకు  కేంద్ర మంత్రి మహాపాదయాత్ర

మార్చి  14న కొండగట్టుకు  కేంద్ర మంత్రి మహాపాదయాత్ర

కరీంనగర్, వెలుగు: కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ‘అంజన్న ఆశీర్వాద యాత్ర’ పేరిట ఈ నెల 14న మహా పాదయాత్ర చేపట్టబోతున్నారు. కరీంనగర్ మేయర్ పదవి బీజేపీకి దక్కితే తన పార్లమెంట్ పరిధిలో ఎన్నికైన బీజేపీ ప్రజాప్రతినిధులందరితో కలిసి కొండగట్టుకు కాలినడక వచ్చి మొక్కులు తీర్చుకుంటానని బండి సంజయ్ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రకటించిన విషయం తెలిసిందే.

ఇందులో భాగంగానే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొత్తగా ఎన్నికైన కరీంనగర్ మేయర్, డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, పంచాయతీ వార్డు సభ్యులతోపాటు సుమారు 10 వేల మంది కార్యకర్తలతో కలిసి ఈ మహా పాదయాత్ర చేయబోతున్నారు.