భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు రూ.10 వేల ఆర్థిక సాయం ఇవ్వాలి

భ‌వ‌న నిర్మాణ కార్మికుల‌కు రూ.10 వేల ఆర్థిక సాయం ఇవ్వాలి

తెలంగాణ రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్మికులకు తక్షణమే 10 వేల‌ ఆర్థిక సహాయం అందించాలన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. లాక్ డౌన్ తో ఉపాధి కోల్పోయిన రాష్ట్రంలో ఉన్న 14 లక్షల భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని తెలిపారు.

కరోనా నివారణ చర్యలతో ఎవరు నష్ట పోకుండా కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం తత్సరం చేయడం తగదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి సెస్ లో ఉన్న 2300 కోట్లు నిధిని కార్మికుల సంక్షేమనికి వినియోగించాలన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కార్మికులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలకు ఆర్డర్స్ ఇచ్చిందని.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలన్నారు.

కార్మిక సంక్షేమ నిధి కోసం ఆన్ లైన్ లో నమోదు చేసుకున్న 8 లక్షల 50వేళా మంది కార్మికులతో పాటు నమోదు చేసుకొని వారికి కూడా ఆర్థిక సహాయం అందించాలన్నారు. కార్మికులకు రూ. 10 వేల‌ ఆర్థిక సహాయం విడుదల చేయాలని చెప్పారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.