న్యూఢిల్లీ: మారుతి, టాటా, మహీంద్రా అమ్మకాలు జూన్లో భారీగా పెరిగాయి. ముఖ్యంగా సీఎన్జీ, ఈవీ బండ్లకు డిమాండ్ కనిపించింది. ఇండియాలో ఈ ఒక్క నెలలోనే 4లక్షల కార్లు అమ్ముడయ్యాయని అంచనా.
- దేశీయంగా మారుతి సుజుకి 1,47,187 యూనిట్లను అమ్మగలిగింది. ఇవి కిందటేడాది జూన్తో పోలిస్తే 23.8 శాతం ఎక్కువ. పెట్రో ధరల పెంపు నేపథ్యంలో ఈ కంపెనీ ఏప్రిల్–జూన్లో ఏకంగా 2,18,213 సీఎన్జీ బండ్లను అమ్మడం విశేషం.
- టాటా మోటార్స్ జూన్లో ఏకంగా 67 శాతం భారీ వృద్ధితో 62,076 యూనిట్ల అమ్మకాలను జరిపింది.
- మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు లోకల్గా 28 శాతం వృద్ధి చెంది 60,393 యూనిట్లకు చేరాయి.
- సప్లయర్ ప్లాంట్లో అగ్నిప్రమాదం జరగడంతో హ్యుందాయ్ అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ కంపెనీ జూన్లో 13,900 యూనిట్ల ఉత్పత్తి నష్టాన్ని ఎదుర్కొంది. మొత్తంగా 39,635 యూనిట్లను అమ్మగలిగింది.
- టయోటా కిర్లోస్కర్ 8 శాతం వృద్ధితో 28,441 యూనిట్లు, కియా ఇండియా 24,552 యూనిట్లను అమ్మగలిగాయి.
- జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ 30 శాతం వృద్ధితో 7,568 యూనిట్లను విక్రయించగా, ఇందులో ఈవీల వాటాయే 75శాతానికి పైగా ఉంది. నిస్సాన్ ఇండియా 3,006 యూనిట్లను విక్రయించింది.
