కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఎవరైనా చెబితే వాళ్లను చెప్పుతో కొట్టండి అంటూ కార్యకర్తలకు, అభిమానులకు సంజయ్ పిలుపునిచ్చారు. తాండూరులో కేంద్రమంత్రి బీఎల్ వర్మతో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సంజయ్.. ఈ సందర్భంగా మాట్లాడారు.
బండి సంజయ్ కామెంట్స్ కు బీజేపీ కార్యకర్తలు తమ చెప్పులను చూపించడం ప్రత్యేకతను సంతరించుకుంది. కేసీఆర్ వి లుచ్చా రాజకీయాలని, ఆయన మాటలు నమ్మవద్దని తెలిపారు. కొంపలు ముంచేందుకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారని, ఆయనకు అపాయింట్ మెంట్ ఎవరూ ఇవ్వరని చెప్పారు.
దేశం అభివృద్ధిలో నడవాలన్నా, దేశంలో పేదరికం అంతరించాలన్నా మరోసారి ప్రధానిగా మోదీని, బీజేపీని 400 పై చిలుకు సీట్ల మెజారిటీతో విజయాన్ని అందించాలని కోరారు. బతికున్నంత వరకు హిందుత్వం, ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటానని చెప్పిన సంజయ్.. . హిందుత్వం మాట్లాడలేని నాడు రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారు.