సికింద్రాబాద్ విధ్వంసానికి టీఆర్ఎస్ బాధ్యత వహించాలి

సికింద్రాబాద్ విధ్వంసానికి టీఆర్ఎస్ బాధ్యత వహించాలి

ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. సికింద్రాబాద్ లో జరిగిన విధ్వంసకాండకు టీఆర్ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అన్ని వందలమంది రైల్వే స్టేషన్ కు ఏవిధంగా వచ్చారో ప్రభుత్వం చెప్పాలన్నారు. యువకులు ప్రశాంతంగా ఆందోళన చేద్దామనుకుంటే..కొందరు కుట్రతో హింసకు పాల్పడ్డారని వారెవరో టీఆర్ఎస్ సర్కార్ బయపట్టాలని డిమాండ్ చేశారు. కొందరు చేసిన విధ్వంసానికి అమాయకులు బలయ్యారని వ్యాఖ్యానించారు. ఇక రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలో రావడం ఖాయమని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు.