పట్టాలివ్వకపోతే గిరిజనులు నీ ఫామ్ హౌస్ను దున్నుతరు: బండి సంజయ్

పట్టాలివ్వకపోతే గిరిజనులు నీ ఫామ్ హౌస్ను దున్నుతరు: బండి సంజయ్

పోడు భూముల సమస్యను పరిష్కారిస్తానన్న కేసీఆర్ రైతులను మోసం చేసిండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ మండిపడ్డారు. కుర్చీ వేసుకుని కూర్చోని గిరిజనులకు పోడు భూముల పట్టాలిస్తానని మాట తప్పాడని అన్నారు. కేసీఆర్.. నువ్వు పట్టాలివ్వకపోతే గిరిజనులు నీ ఫామ్ హౌస్ ను దున్నే రోజులు వస్తాయి గుర్తు పెట్టుకో అని హెచ్చరించారు. ఎన్నికలు ఉన్నప్పుడే నీకు గిరిజనుల పోడు భూముల సమస్య గుర్తుకు వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు.

ఇవాళ బండి సంజయ్ సమక్షంలో సిరిసిల్ల సెస్ మాజీ వైస్ ఛైర్మన్ లగిశెట్టి శ్రీనివాస్, పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారిని కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన బీజేపీ స్టేట్ ఆఫీసులో మాట్లాడారు.