ట్రిపుల్ ఐటీపై కేసీఆర్ కక్షగట్టినట్లు వ్యవహరిస్తుండు

ట్రిపుల్ ఐటీపై కేసీఆర్ కక్షగట్టినట్లు వ్యవహరిస్తుండు

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కలుషిత ఆహారం కారణంగా వందలాది మంది విద్యార్థులు అస్వస్థతకు లోనవడం ఆందోళన కలిగిస్తోందని అన్నారు. అనారోగ్యంపాలైన విద్యార్థులందరికీ తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్  చేశారు.  

బాసర ట్రిపుల్ ఐటీ విషయంలో సీఎం కేసీఆర్ కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇబ్బంది పెడుతున్నారని విమర్శించారు. అడుగడుగునా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.